Loading...

చందోలు గ్రామంలోని శ్రీ బగళాముఖి అమ్మ వారి ఆలయ నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించిన బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ బగళాముఖి అమ్మ వారి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించిన బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు.

అమ్మ వారి ఆలయ నూతన పాలకవర్గ సభ్యుల వివరాలు:-

కలకోట చక్రధర్ రెడ్డి, కె.నాగవేణి, ఎ.వి.పద్మజ, యన్.సముద్రాలు, వెంకటప్పయ్య, ఎ.ఉషారాణీ, కె.పట్టాభిరామారావు, కె.అశోక్, కె.శివలీలా, వి.ప్రసాద్, సిహెచ్.రాంబాబు, డి.బాలాజీ రెడ్డి ఈ కార్యక్రమంలో పిట్టలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అఫ్జల్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కనుమూరి సాంబమూర్తి రాజు,వెంకటపతిరాజు,శివాలయం కమిటీ చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు,చెన్నకేశన స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఇండూరి సాయి గుప్తా మరియు తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ బగళాముఖి అమ్మ వారికి రూ 51,116 విరాళం ప్రకటించిన శ్రీ ఉండవల్లి శ్రీమన్నారాయణ: 

చందోలు గ్రామానికి చెందిన ఉండవల్లి అశోక్ కుమార్(ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి)  మరియు వారి తండ్రి గారైన ఉండవల్లి శ్రీమన్నారాయణ గార్లు ఆలయ ట్రస్ట్ బోర్డుకి  రూ 51,116 విరాళం ప్రకటించారు.